ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రెండు గ్రామాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని తొక్కి చంపింది. తాల్చేర్ ప్రాంతంలోని సాంధా అనే గ్రామంలో గురువారం రాత్రి ఓ కుటుంబంలోని నలుగురు వ్యక్తులు గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో ఢెంకానాల్ అటవీ ప్రాంతం నుంచి ఓ ఏనుగు తప్పించుకొని ఆ ఇంటిపై దాడి చేసింది. నిద్రలో ఉన్న నలుగురినీ తొక్కింది.
దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అదే గ్రామానికి చెందిన మరో స్త్రీపై దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి సమయంలో జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు.