*హనుమకొండలో యువతి ఆత్మహత్య..
*కానిస్టేబుల్ వేధింపులతో మనస్తాపం చెందిన యువతిఆత్మహత్య
ప్రేమపేరుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధింపులను భరించలేక యువతి పురుగులు మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
ములుగు జిల్లా ఏటూరునగరం లోని అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తోంది సంగీత. మృతురాలిది స్వగ్రామం హనుమకొండ జిల్లా శాయంపేటమండలం .
హనుమకొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్గా సర్వేశ్యాదవ్ వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు పెళ్ళి కాలేదని మాయమాటలు చెప్పి సర్వేష్యాదవ్ మృతురాలు సంగీతకు పరిచయమయ్యాడు.
సంగీత బంధువులు అతనికి వివాహమైన విషయం తెలుసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇకనుంచి ప్రేమ అంటూ వెంటపడొద్దని తెలిపారు. అయినా అతను మూడు నెలల నుంచి పదే పదే ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, నువ్వు ఒప్పుకోకపోతే బాగోదని వేధించసాగాడు.
కానిస్టేబుల్ పెట్టిన టార్చర్ భరించలేక.. ఇంట్లో వాళ్లతో చెప్పుకోలేక ..తనలో తానే కుమిలిపోయింది. వేరే దారి లేకపోవడంతో సంగీత సోమవారం ఏటూర్నాగారంలో డ్యూటీ ముగించుకొని మందరిపేటలోని ఇంటికి చేరుకుంది. రాత్రి 9గంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగింది.
గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆటోలో పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది.ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి దొంగరి వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.