మహేశ్ కథానాయకుడిగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న “మహర్షి” సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ఉగాది కానుకగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. మే 9న ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి పోస్టర్ ను విడుదల చేసి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు చిత్రబృందం. ఈ పోస్టర్ లో మహేష్ బాబు బ్లూ కలర్ సూట్ లో కూలింగ్ గ్లాసెస్ తో స్టైలిష్ గా కన్పిస్తున్నాడు. ఇక “మహర్షి”లో మూడు డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
#JoinRishi tomorrow at 9:09 a.m… Join The Journey of our Superstar @urstrulyMahesh as RISHI tomorrow… This Ugadi will be much more special with the teaser of #Maharshi. #MaharshiTeaserOnApril6th @directorvamshi @hegdepooja @allarinaresh @ThisIsDSP @KUMohanan1 pic.twitter.com/VRCluYOSLt
— Sri Venkateswara Creations (@SVC_official) 5 April 2019
హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు..