వైఎస్సార్ సీపీ ప్రజల కోసమే పుట్టిందని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచిస్తున్న వైఎస్ జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని వైఎస్ విజయమ్మ కోరారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మీ అందర్నీ కోరుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరిని రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోమని విజ్ఞప్తి చేశారు.
ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, పంటలకు గిట్టుబాటు ధరలు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాల వంటి పథకాలు రాజన్న హయాంలో చేపట్టినవే అని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. మళ్లీ జగన్ బాబు అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు.
కవిత ఓటమికి కారణాలు వివరించిన కేటీఆర్