మంగళవారం తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్లో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకలో పాల్గొన్న మంచు మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యనే తాను మార్కెట్ లో కొన్ని జంతువుల ధరలు తెలుసుకున్నానని, మంచి గేదె ధర రూ.80 వేలు ఉందని, మేక ధర రూ.8 వేలని, అదే పంది ధర రూ.3-5 వేల రూపాయలు ఉందని చెప్పారు. కానీ మన ఓటు ధర రూ.500 నుంచి మహా అయితే రూ.5000 పలుకుతుందని, అంటే మనం పందుల కంటే హీనమా ? అంటూ ప్రశ్నించారు. డబ్బుకు అమ్ముడుపోయి ఓటు వేయొద్దంటూ ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతను తెలిపారు. ఇక తన సినిమా జూన్ లో ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు.


మీటూపై తాప్సి వ్యాఖ్యలు