యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో ‘అరవిందసమేత వీరరాఘవ’ అనే చిత్రం వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్తో వీరి కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనుంది. టైటిల్ అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ.. మూవీ ప్రకటన మాత్రం వచ్చింది. ఈ లాక్డౌన్లో ఇతర నటీనటులను కూడా త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్కు ఆయన స్టార్ ఇమేజ్కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అయితే.. తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ కాగా… పూజా కార్యక్రమాలకు కూడా ముహుర్తం ఫిక్స్ అయింది. జనవరి 14న అంటే మకర సంక్రాంతి సందర్భంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల మూవీకి కొబ్బరికాయ కొట్టబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. హాసిన అండ్ హారిక వారి ఆఫీస్లో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని అంటున్నారు. ఒకరు, ఇద్దరు ప్రముఖులతో పాటు యూనిట్ సభ్యులు అంతా కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉంది. పవర్ స్టార్ ను కూడా తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. అన్ని అనుకున్నట్టు అయితే… వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండబోతుంది.
previous post
ఈసారి చెంప చెళ్ళుమన్పిస్తా… : చిన్మయి శ్రీపాద