ప్రజాస్వామ్యంపై దాడి: స్పీకర్ నిర్ణయాన్ని కేటీఆర్ “ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి” గా అభివర్ణించారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీకి మద్దతు తెలుపుతున్న నేతలకు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఓటు వేసిన ప్రజల తీర్పును అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విలువలకూ, యాంటీ డిఫెక్షన్ లా (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ విమర్శించారు.
సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
సాంకేతికంగా వారు బతికిపోయినా, ప్రజల కోర్టులో ఆ ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హులుగా ముద్ర పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.


జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు