telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్త‌గా 68,898 మందికి పాజిటివ్

Corona

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో క‌రోనా కేసులు 29 ల‌క్ష‌ల మార్కును దాటాయి.

గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 68,898 పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 29,05,824కు చేరాయి. ఇందులో 6,92,028 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 21,58,947 మంది బాధితులు కోలుకున్నారు.

నిన్న ఉద‌యం నుంచి క‌రోనాతో 983 మంది మ‌రణించారు. దీంతో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 54,849కి పెరిగింద‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 20 నాటికి దేశ‌వ్యాప్తంగా 3,34,67,237 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి వెల్లడించింది.

Related posts