telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం

‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

‘గత 19 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి అని సూచించారు.

రాష్ట్రంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు అవసరమా? అనే చర్చ సరి కాదు పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

‘ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలలవారీగా సమీక్షించుకోవాలి. క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండు సార్లు కేబినెట్ సమావేశాలు, ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం.

జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంచార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

‘రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. దీపం.2.0 ద్వారా 2 కోట్ల సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సైతం వర్చువల్‌గా హాజరయ్యారు.

Related posts