అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో కొనసాగుతున్న రథసప్తమి వేడుకలు.
ఈరోజు అర్ధరాత్రి 12.05 గంటలకు ప్రారంభంకానున్న రథసప్తమి తొలిపూజ. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి రేపు ఉ. 7.30 వరకు మూలవిరాట్ కు క్షీరాభిషేకం చేయనున్నారు.
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి అచ్చెన్నాయుడు. రేపు ఉ.8 నుంచి సా. 4 వరకు సూర్యభగవానుడి నిజరూప దర్శనం.
స్వర్ణాభరణ అలంకరణలో దర్శనమివ్వనున్న సూర్యనారాయణస్వామి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. అంబేడ్కర్ కళావేదికలో సురభి నాటక ప్రదర్శనలు జరగనున్నాయి.

