telugu navyamedia
వార్తలు సామాజిక

ఇండియన్ నేవీలో కరోనా కలకలం.. 21 మందికి పాజిటివ్ నిర్ధారణ

ఇండియన్‌ నేవీలో కరోనా కలకలం రేపుతోంది. ముంబయి ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్‌ బేస్‌ సిబ్బంది 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ముంబైలోని నేవల్ హాస్పిటల్ లో వీరిని క్వారంటైన్ చేశారు. ఇండియన్ నేవీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. యుద్ధ నౌకల్లో ఉన్న అధికారులు, సెయిలర్లు ఎవరికీ కరోనా రాలేదని వెల్లడించింది.

సెయిలర్స్ తో కాంటాక్ట్ లోకి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రేను లాక్‌డౌన్‌ చేశారు. కేసులు బయటపడిన వెంటనే బ్లాకు మొత్తాన్ని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. మిగతా సిబ్బందికి కూడా కరోనా సోకకుండా ముందస్తు ఛాయలు చేపట్టారు.

Related posts