అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తేగాడ మోడల్ స్కూల్లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు
తేగాడ పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించారు హోంమంత్రి అనిత. క్రీడా మైదానం కావాలని విద్యార్థులు కోరగా ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
తేగాడలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేసిన హోంమంత్రి. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి అనిత, కలెక్టర్ విజయ్కృష్ణన్.
చిన్న పొరపాట్ల వల్ల పిల్లల జీవితాలను నాశనం చేసుకోకండి, పిల్లలకు చట్టాలపై అవగాహన ఉండాలి అన్నారు.
విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు అని హోంమంత్రి అనిత అన్నారు.

