మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు ఏపీ కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే సీనియర్లు పార్టీలు మారుతున్న నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డీసీసీ పదవి విషయంలో రఘువీరా, బైరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. దీంతో బైరెడ్డి పార్టీని వీడాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సాయంత్రం అధికారికంగా కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. నాలుగు నెలల క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో విభేదాల కారణంగా బైరెడ్డి రాజీనామా చేస్తున్నారని ఆయన అనుచరులు తెలిపారు. రేపు తన అనుచరులు ముఖ్య కార్తలతో చర్చించి భైరెడ్డి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
చంద్రబాబు నివాసంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు