telugu navyamedia
నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

‘ఆపరేషన్ సిందూర్’ దాడుల పై మీడియా సమావేశంలో తొలిసారి ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొన్నారు

పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులకు సంబంధించిన అధికారిక మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొని వివరాలు వెల్లడించడం భారత సైనిక చరిత్రలోనే ఒక నూతన అధ్యాయనంగా నిలిచింది.

ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఆపరేషన్కు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టడం కూడా మహిళా శక్తికి ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది.

ఇద్దరు మహిళా అధికారులు ఎంతో ఆత్మవిశ్వాసంతో, అధికారికంగా మాట్లాడిన తీరు ఉగ్రవాదంపై పోరాడాలన్న దేశ సంకల్పాన్ని, పహల్గామ్ మారణకాండకు అన్ని విధాలా తగిన సమాధానాన్ని ప్రతిబింబించింది.

ఉగ్రవాదులు మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని చూశారని, ఈ ఇద్దరు అధికారులు భారత్ ప్రతీకారం గురించి ప్రపంచానికి వివరించడం, పాక్ గురించి అదనంగా ఒక్క మాట మాట్లాడకుండానే శక్తివంతమైన సందేశాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశ ప్రతిస్పందనలో మహిళలు ముందంజలో ఉన్నారనే సందేశం స్పష్టంగా వెళ్లింది. ఇక, సోషల్ మీడియాలో అయితే ఈ ఇద్దరు మహిళా ఆపీసర్ల మీడియా సమావేశాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారు.

Related posts