కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్ పై చిరంజీవి ,నయనతార తో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న “సైరా నరసింహ రెడ్డి ” చిత్రం తాజా షెడ్యూల్ రామాంజి ఫిలిం సిటీలో రేపటి నుంచి ప్రారంభం అవుతుంది . ఈ షెడ్యూల్ లో అమితాబ్ చిరంజీవికి సంబందించిన సన్నివేశాలను పూర్తి చేస్తారని తెలుస్తుంది .
సైరా చిత్రంలో అమితాబ్ బచ్చన్ చిరంజీవి గురువు పాత్రలో నటిస్తున్నాడు . వేసవి రావడం , బయట అయితే భద్రత ఉండదని ఉద్దేశ్యంతో ఫిలిం సిటీలో ఈ షెడ్యూల్ చెయ్యాలని నిర్ణయించారట . అమితాబ్ ఈ నెల 12 నుంచి 20 వరకు సైరా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది .
సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ఎప్పుడో మొదలు పెట్టారు . అయినా ఇంకా 50 శాతం వర్క్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది . విజయదశమికి సినిమాను విడుదల చెయ్యాలనే ఉద్దేశ్యంతో వున్నారు . సైరా సినిమాలో చిరంజీవి , నాయన తార , అమితాబ్ బచ్చన్ , సుదీప్ , తమన్నా , విజయ్ సేతుపతి, జగపతి బాబు , అల్లు అర్జున్ నటిస్తున్నారు .
ఆర్ . రత్నవేలు ఛాయాగ్రహణం , అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చుతున్నారు . నిర్మాత రామ్ చరణ్, దర్శకత్వం సురేంద్ర రెడ్డి .
ఆంధ్రా మరో బీహార్ లా తయారైంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు