telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగుళూరు పర్యటన.

కర్ణాటక రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమావేశం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ను అరి కట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ. అక్కడ ప్రభుత్వ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది.

ఈ నెల 13న శ్రీహరి కోటకు ఆయన వెళ్లనున్నారు.

కుంకి ఏనుగుల మనుగడ, జీవన విధానంలో మార్పుపై పవన్ చర్చించనున్నారు. వాటి రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మనుగడ పైనా ఆ రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడనున్నారు.

చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి.
ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరం.

ఈ కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు మన రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను  పవన్ కోరనున్నారు.

ఇరు రాష్ట్రాల అటవీశాఖ అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts