గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ఇంకోసారి అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. దీంతో రాజాసింగ్ తన నివాసంలో లాయర్లతో చర్చలు జరుపుతున్నారు.
మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ సహా శాయినాథ్ గంజ్ పీఎస్లలో నమోదైన కేసులలో పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. 41 ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
ఈ నోటీసులు జారీ అవ్వడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను మళ్లీ అరెస్ట్ చేయడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పాత కేసులకు సంబంధించి 41(A) సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని, ఏప్రిల్ ఘటనకు సంబంధించి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని రాజా సింగ్ నిలదీశారు.
తనను ఓడించాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయి: కవిత