*హోం మంత్రి మహమూద్ అలీ వార్నింగ్
*తెలంగాణ ప్రజలు శాంతి పాటించాలి..
*బండి సంజయ్ మాటల్ని ఎవరూ పట్టించుకోవద్దు
*బీజేపీ కావాలనే మత విద్వేషాలకు రెచ్చగొడుతోంది
*ప్రజలెవరూ బీజేపీ ట్రాప్లో పడొద్దు..
*అల్లర్ల చేస్తే ఏ పార్టీ అని చూడం ..సీరియస్ యాక్షన్ ఉంటుంది
రాజాసింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హోం మంత్రి మహమూద్ అలీ గురువారం విలేకరులతో మాట్లడుతూ.. నగరంలో శాంతియుతంగా ఉన్న వాతావరణాన్ని బీజేపీ కలుషితం చేస్తోందని అన్నారు. బండి సంజయ్ మాటల్నిపట్టించుకోవద్దు..బీజేపీ కావాలనే మత విద్వేషాలకు రెచ్చగొడుతోందని అన్నారు.
రాజాసింగ్ వ్యాఖ్యల వల్లే హైదరాబాద్లో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని అన్నారు. తెలంగాణ ప్రజలెవరూ బీజేపీ ట్రాప్లో పడొద్దు అని మహమూద్ పిలుపునిచ్చారు. అల్లర్ల చేస్తే బీజేపీ అయినా, ఎంఐఎం అయినా ఎవరినీ వదిలేది లేదు సీరియస్ యాక్షన్ ఉంటుందని మహమూద్ అలీ వార్నింగ్ ఇచ్చారు.