కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూర్లో రోడ్డు ప్రమాదం
కంటైనర్ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఆరుగురు మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకోవడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మద్నూరు మండలం మేనూర్ వద్ద ప్రమాదం జరిగింది.
కంటైనర్ లారీ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తోంది. మరోవైపు ఆటో మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్రూట్లో వస్తోంది. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ఆటో.. ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జయింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. కంటైనర్ లారీ డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.