కేసీఆర్ బలం, బలహీనతలు అన్ని తనకు తెలుసని, సీఎం కేసీఆర్ను బొందపెట్టేది తానేనంటూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వాఖ్యలు చేశారు.
సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. కేసీఆర్ ను ఓడగొడితేనే తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందన్నారు. చరిత్ర నిర్మాతలు ఎప్పుడూ నాయకులు కాదని.. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని అన్నారు.
సీఎం కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మి.. మతి భ్రమించి మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని ఈటెల సవాల్ విసిరారు. గతంలో తాను చేసిన సవాలుకు కట్టుబడి ఉన్నట్టు ఈటల స్పష్టం చేశారు.
కేసీఆర్కు కావాల్సింది బానిసలని.. ఉద్యమకారుడిగా తాను ప్రశ్నిస్తే పార్టీ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. హుజూరాబాద్లో తనను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని.. ఓటుకు నోటు ఇచ్చారన్నారు.
డబ్బుతో తనను ఓడించాలని కేసీఆర్ కలలు కన్నారని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్. తనలాంటి వారు కేసీఆర్ నచ్చలేదన్నారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్.. తప్పకుండా ఎన్నికలు పెడతారు. వర్షం పట్ల ఇబ్బందులపై ప్రెస్మీట్ పెడతారనుకున్నా. కానీ.. కుర్చీ కోసం పెట్టారు.
ఎన్నికల్లో గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మీద పోటీ చేస్తానని అన్నారు. బిజెపి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని ఆయన అన్నారు.మా అమ్మనాకు సంస్కారం నేర్పించిందని చెప్పారు. రాజపక్సే లాగా నిన్ను తెలంగాణ ప్రజలు తన్ని తరిమేస్తారు. దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో చర్చకు రావాలి.. బూతు పురాణంతో కాదని అన్నారు.
ఇప్పటికే అమిత్ షా కూడా కేసీఆర్ అసెంబ్లీ ని రద్దు చేస్తే… సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.’ అని ఈటెల రాజేందర్ వెల్లడించారు.
సాహసకృత్యాలు దేశాన్ని ముందుకు నడిపించలేవు: ప్రణబ్ ముఖర్జీ