కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న హింసాత్మక ఆందోళనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
సోమవారం ఉదయం ‘అగ్నిపథ్’ నిరసనలపై ఆనంద్ మహీంద్ర తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. గతేడాదిఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు తాను అగ్నివీరులు పొందే క్రమశిక్షణ నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలాచేస్తాయని చెప్పానని..ఇప్పుడూ అదే చెబుతున్నాఅన్నారు..
ఈ పథకంతో శిక్షణ, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. అగ్నిపథ్ పై హింసాత్మక సంఘటనలు చాలాబాధాకరమైనవని అన్నారు.
ఈ పథకం కింద సైన్యంలో శిక్షణ పొందిన సమర్థులైన అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ప్రకటించారు.