మెగా పవర్స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ను సందర్శించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు.
\కృతజ్ఞతా భావంగా మిస్టర్ చరణ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో లంగర్(అన్నదానం) సేవను ఏర్పాటు చేశారు. ఆయన RC 15 షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల, ఈ సేవలో చెర్రీ తరపున నేను పాల్గొన్నాను” అంటూ ఉపాసన చెప్పుకొచ్చారు.
తనకు, చరణ్ కు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. తను గోల్డెన్ టెంపుల్ లో ఉన్నట్లు ఉపాసన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్.. పంజాబ్లో అమృత్ సర్ లోనే షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఓ యూనివర్సిటీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ కాలేజీ సీన్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్లు నిర్మిస్తున్నారు.
As a mark of gratitude Mr.C hosted a langar seva at the golden temple in Amritsar.
I had the privilege & opportunity to represent him by participating in the seva as he was shooting for #RC15Rc & I feel blessed with with your love & accept it with humility @AlwaysRamCharan pic.twitter.com/Tz8GYDO4bx
— Upasana Konidela (@upasanakonidela) April 19, 2022