బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరుస సినిమాలుతో బీజీగా ఉన్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘పఠాన్’ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా అట్లీ దర్శకత్వంలో షారుక్ చేస్తున్న సినిమా కూడా ప్యాచ్వర్క్ మినహా పూర్తయింది. ఈ రెండు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
తాజాగా రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ”డంకి’ పేరుతో సినిమా తెరకిక్కస్తున్నట్లు వెల్లడించారు. ఈ ‘డంకీ’ సినిమా గురించి ప్రకటించడమే కాదు, దాని కోసం షారుఖ్ తో కలసి రాజ్ కుమార్ హిరాణీ ఓ వీడియో తయారు చేశారు.
ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా పూర్తయిందని తెలిపారు మేకర్స్. తరువాత షెడ్యూల్ పంజాబ్లో, ఆ తర్వాత విదేశీ లొకేషన్స్లో చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. అక్రమంగా పాస్పోర్టులు పొంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్.
ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తుంది. 2023 డిసెంబరు 23న క్రిస్మస్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. షారుఖ్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో ఇదే మొదటి చిత్రం. మున్నాభాయ్’ సిరీస్, ‘పీకే’, ‘సంజు’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు హిరానీ.
రామ్ గోపాల్ వర్మపై నూతన దర్శకుడు ఫైర్