ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఊరేగింపు లో పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.
మీ ఆర్భాటాల కోసం శిశువుల్ని చంపేయడమే శిశు సంక్షేమమా మంత్రి గారు! నారా లోకేష్ ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి మంత్రి, పోలీసులు చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. చిన్నారి కొనప్రాణాలతో కొట్టుకుంటున్న కనికరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటన కోసం పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ తో శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైంది. ఇది ముమ్మాటికీ మంత్రి, పోలీసులు చేసిన హత్యే.(1/2) pic.twitter.com/7fLQvjI0Bn
— Lokesh Nara (@naralokesh) April 15, 2022
తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలి..మాజీ మంత్రి చింతా మోహన్