మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’.ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ‘బుల్ బుల్ తరంగ్’ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం మోగేను.. లవబ్ డబ్ మాని నీ పేరై మోగేను..’ అంటూ సాగే ఈ పాటను సామ్ సిఎస్ కంపోజ్ చేయగా సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. రాకెండు మౌలి లిరిక్స్ అందించారు.
ఈ లవ్లీ రొమాంటిక్ మెలోడీలో రవితేజ, రజీషాల కెమెస్ట్రీ చూడముచ్చటగా ఉంది.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించాడు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 17న గ్రాండ్గా సినిమా రిలీజ్ కానుంది.
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు