విజయవాడ: ఏపీ ఎక్సైజ్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ సారా ఘటనపై విచారణ జరపాలని, నకిలీ బ్రాండ్లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీఎమ్మెల్యేలు వెళ్లారు.
వారిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే కనీసం ఐదుగురినైనా లోపలకు అనుమతించాలని, కమిషనర్కు వినతి పత్రం ఇచ్చి వస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు కోరినా పోలీసులు వినలేదు. తామేమి నేరం చేయడానికి రాలేదని ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు పోలీసులను ప్రశ్నించారు.
అయినా పోలీసులు పట్టించుకోలేదు. వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి వేరే బస్సులో తరలించడంతో కొద్దిసేపు టిడిపి శ్రేణులకు – పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది…