telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రఘురామకృష్ణంరాజుకు ఎంపీ పదవి.. జగన్ పెట్టిన భిక్ష

రఘురామకృష్ణంరాజుపై ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీగా గెలిచారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష అని..ముఖ్యమంత్రి జగన్ దయతోను, ఆయన పెట్టిన బిక్షతోనూ ఎంపీగా గెలుపొంది పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదన్నారు. మాట్లాడే భాష, తీరు, వ్యవహరించే విధానం ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ ఆయనకు లేదని.. ఎంపీగా గెలిచి రెండేళ్లు కావొస్తున్నా ఆయన ప్రజలకోసం చేసిందేమీ లేదని ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ఈయన అన్నీ గాలికొదిలేసి ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను ఎదో ఒక హీరోలాగా కనిపిస్తానని భ్రమపడి ఒక ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగుదేశం వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఎక్కడబడితే అక్కడ తన స్థాయిని మరచి ఎలాబడితే అలా మాట్లాడుతున్నారని.. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ ను తామంతా సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది ఈ విషయం ఆయన్ను సమర్థిస్తున్న వాళ్ళు కూడా తెలుసుకోవాలని మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

Related posts