telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం చేతకానితనం వల్లనే కరోనా పెరిగిపోతోంది: చంద్రబాబు

chandrababu

ఏపీలోని నియోజకవర్గాల టీడీపీ ఇన్ చార్జులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చేతకానితనం వల్లనే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని చెబుతున్న జగన్ ఇంతవరకు మాస్కు ధరించలేదని విమర్శించారు. ఇప్పటివరకు మాస్కు ధరించని సీఎం, ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తామనడం సరికాదని అన్నారు.

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారాన్ని చంద్రబాబుకు నివేదించారు. కావాలనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని ఎమ్మెల్సీ చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఇకపై ఎన్టీఆర్ విగ్రహాలను తాకితే వైసీపీ నేతలకు వణుకు పుట్టేలా టీడీపీ శ్రేణుల చర్యలుండాలని సూచించారు.

Related posts