వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టీమ్పై తేనెటీగలు దాడి చేశాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్ర సాగిస్తున్నారు.
నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ షర్మిల.. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాత్రను కొనసాగస్తున్నారు.
షర్మిల మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.
తేనెటీగలు దాడి చేస్తున్నప్పటికీ.. షర్మిల తన పాదయాత్రను ఆపలేదు. అదే అంకితభావంతో యాత్రను కొనసాగించారు. ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పార్టీ శ్రేణులు తమ కండువాలనే గాల్లోకి ఊపుతూ తేనెటీగలను తరిమేశారు.
దీంతో వెంటనే షర్మిల భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది.తమ కండువాలనే గాల్లోకి ఊపుతూ తేనెటీగలను తరిమేశారు. దీంతో షర్మిల తేనెటీగల దాడి నుండి బయటపడ్డారు.
అయితే, తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.
దుర్సగనిపల్లిలో వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేస్తుండగా తేనెటీగలు కుడుతున్న ధైర్యంతో ముందుకు సాగారు.🔥💥 pic.twitter.com/IQ8epF4VYs
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) March 23, 2022
ఒక్క సంతకంతో వేల బస్సులను రోడ్లపైకి తీసుకోస్తా: కేసీఆర్