మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఉపాసన విహారయాత్రకు వెళ్లారు. రామ్చరణ్ షూటింగ్కు స్మాల్ బ్రేక్ ఇచ్చి వేకేషన్ మోడ్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘రెండేళ్ల తర్వాత రామ్ చరణ్తో వెకేషన్కి వెళుతున్నాను’ ధన్యవాదాలు మిస్టర్ సి” అంటూ అంటూ ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉపాసన షేర్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇందులో చరణ్ మాస్క్ తో తన లుక్ ని కవర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది.
కాగా శంకర్ దర్వకత్వంలో రామ్చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో కొన్ని ఫ్లాష్బ్యాక్ సీన్స్తో పాటు రామ్చరణ్– అంజలి కాంబినేషన్లోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని సమాచారం.‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్ర యూనిట్.
Finally a vacation after 2 years !
Thank u Mr C ♥️♥️🤗🤗@AlwaysRamCharan pic.twitter.com/AbLXU74OcG— Upasana Konidela (@upasanakonidela) March 6, 2022