టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. లవ్ జర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు సరైనోడు చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
గురువారం కృష్ణా జిల్లా ఉయ్యురు మండలం మంటాడ గ్రామం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి… అక్కడికక్కడే మరణించారు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
జక్కుల నాగేశ్వరరావు మరణవార్త తెలిసిన సినీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు