telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ సర్కారుకు రూ.120 కోట్ల భారీ జరిమానా ..

పోవలరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా.. కట్టిన మరో మూడు ప్రాజెక్టులకు సైతం జరిమానా విధించింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.56 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ.73.6 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి రూ.24.90 కోట్ల జరిమానా విధించింది.

ఈ జరిమానాను 3 నెలల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఈ జరిమానా చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా నిధుల వినియోగంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతల ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు చేసిన వారిలో పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్‌ ఉన్నారు.

Related posts