నవంబర్ 26తో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింగు, టిక్రి మరియు ఘాజీపూర్లలో కొనసాగుతున్న రైతుల అందోళనలకు ఏడాది పూర్తవుతుందని గుర్తు చేశారు. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికైత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నవంబర్ 26 వరకు కేంద్రానికి సమయం ఉందని, ఆ తర్వాత ఢిల్లీ చుట్టూ రైతు నిరసనలు తీవ్రమవుతాయని కేంద్రానికి తికైత్ హెచ్చరించారు.
రైతుల సామూహిక సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. రైతు సంఘం BKU, దీని మద్దతుదారులు ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపూర్లో శిబిరాలు వేస్తున్నారు, ఇది కూడా SKMలో భాగమే.
“కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఉంది ..ఉపసంహరించుకోకపోతే ..నవంబర్ 27 నుండి, రైతులు గ్రామాల నుండి ట్రాక్టర్లలో ఢిల్లీ చుట్టూ ఉన్న ఉద్యమ ప్రాంతాల వద్ద సరిహద్దుకు చేరుకుంటారు మరియు పటిష్టమైన కోటలతో ఉద్యమ స్థలంలో టెంట్లను బలోపేతం చేస్తారు, ”అని బికెయు జాతీయ ప్రతినిధి టికైత్ స్పష్టం చేశారు.
ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సింది: కుమారస్వామి