telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా..తాను ఏ తప్పు చేయలేదు: నన్నపనేని

nannapaneni rajakumari

భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదని మాజీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బైబిల్, ఖురాన్, భగవద్దీత దేనిపైనా ప్రమాణం చేయడానికైనా తాను సిద్దంగా ఉన్నానని ఆమె చెప్పారు. తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న తాను ఏనాడూ ఇతరులను ఇబ్బందిపెట్టలేదని ఆమె గుర్తు చేశారు.

తనకు ఉన్న మంచిపేరును చెడగొట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి నా పై అభియోగం మోపుతున్నారని ఆమె చెప్పారు. తనపై కక్షసాధింపు కోసం మహిళ ఎస్ఐను వాడుకొన్నారని ఆమె ఆరోపించారు.తాను తప్పుగా మాట్లాడినట్టుగా అనురాధ బహిరంగంగా ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదని నన్నపపేని గుర్తు చేశారు.

Related posts