తేజ్ ప్రమాదం పై నటుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బైక్ రైడింగ్పై నరేష్ మాటలను పలువురు ప్రముఖులు తప్పబట్టారు. హీరో శ్రీకాంత్ కూడా నరేష్ ని ఉద్దేశించి కొంచం ఘాటు వ్యాఖ్యలే చేశాడు. ‘నాకు నరేష్ గారు పెట్టిన బైట్ బాధ కలిగించింది, చనిపోయిన వ్యక్తుల గురించి నరేష్ మాట్లాడటం అంత మంచిది కాదేమో అనిపించింది. ఇక దయచేసి ఇలాంటి బైట్స్ ఎవరు పెట్టొద్దు’ అంటూ కామెంట్ చేశాడు.
దీంతో నరేష్ కూడా జాగ్రత్త శ్రీకాంత్ అంటూ రీ కౌంటర్ ఇచ్చాడు. తానూ కాదు నువ్వే అలోచించి మాట్లాడు.. 50ఏళ్ళ నా సినీ కెరీర్ లో నన్ను ఇంతవరకు ఎవరు ఇలా అనలేదు. ఇంకోసారి ఇలాంటివి చేయకు’ అంటూ శ్రీకాంత్ కి గట్టి కామెంట్ చేశాడు. సాయితేజ్ విషయంలో తాను విడుదల చేసిన వీడియో బైట్ మీడియాలో తప్పుగా ప్రసారం కావడం వల్ల పెద్దలు మందలించారని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయంలో శ్రీకాంత్ జోక్యం చేసుకోవడం సమంజసంగా లేదని మండిపడ్డారు. తన ముందే హీరోగా ఎదిగి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సంతోషం.. మా ఎన్నికల్లో పోటీ చేసి దురదృష్టవశాత్తూ తమ ప్యానల్ ముందు ఓడిపోయారని తెలిపారు. దయచేసి ఇంకొసారి ఇలా బైట్స్ ఇవ్వొద్దొమ్మా ..బైట్స్ ఇచ్చేముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బైకులు మనం చాక్లెట్స్ లా పిల్లలకు ఇవ్వలేం. వాళ్లంతా అడల్ట్స్. నువ్వు మాట్లాడిన మాటలకూ నేను హార్ట్ అయ్యాను. చనిపోయినవారి గురించి నేను మాట్లాడలేదని అన్నారు.
కాగా..యుక్త వయస్సులో వచ్చిన వాళ్లకు ద్విచక్రవాహనాలు నడపడం సహజమని, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా సహజమని నరేశ్ వ్యాఖ్యానించారు. సాయితేజ్ స్పీడ్గా వెళ్లలేదని, జారిపడిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని మరోమారు తెలిపారు.
ఆ వివాదాస్పద వీడియోను డిలీట్ చేసిన శ్రావణ భార్గవి..