telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్తగా 1,608 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో 67,911 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,608 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 281 మందికి కరోనా నిర్ధారణ కాగా, నెల్లూరు జిల్లాలో 261, తూర్పు గోదావరి జిల్లాలో 213, కృష్ణా జిల్లాలో 161, పశ్చిమ గోదావరి జిల్లాలో 154 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 1,107 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,27,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,98,561 మంది రికవరీ అయ్యారు. ఇంకా 15,119 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 13,970 మంది మృతి చెందారు.

 

Related posts