telugu navyamedia
క్రైమ్ వార్తలు

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట జిల్లా పాల‌కీడు మండ‌లంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన పాలకీడు మండలంలో చోటుచేసుకుంది. పాలకీడు మండలం జాన్ పహాడ్ వద్ద TS05 UA5989 అనే నంబరు గల లారీ భీభత్సం సృష్టించింది. జాన్పాడు దర్గా నుంచి దామరచర్ల వైపు వెళ్తున్న రెండు బైకుల పైకి దామరచర్ల వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీ కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

రెండు బైకులు ధ్వంసం అయ్యాయి. స్కూటీ పై ప్రయాణిస్తున్న భార్యభర్తలు మిర్యాలగూడ మండలం జంకు తండాకు చెందిన ధరావత్ పుణ్య(55), మగతి(50)గా గుర్తించారు. లారీ కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. లారీ కింద ఉన్న వారిని క్రేన్ సహాయంతో బయటకు వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగినపుడు మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉన్నాడు. ఘటన తరువాత అక్కడినుంచి లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు.

Related posts