తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు హరీశ్ రావు, నాయిని నరసింహారెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులకు మరోసారి అవకాశం దక్కదని జోస్యం చెప్పారు. కడియం, నాయినిలపై ఒక్క అవినీతి మచ్చ లేదని అయైనప్పటికీ వారికి మంత్రి పదవులు ఇవ్వడం లేదని వాపోయారు.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 19న కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్లకు ఈ సారి కేబినెట్ లో బెర్తు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి 8 నుంచి 9 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. గతంలో అవకాశం దక్కించుకున్న వాళ్లలో చాలా మందికి మళ్లీ అవకాశం దక్కక పోవచ్చని సమాచారం.
ఏపీ భవిష్యత్తు అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది: సోమిరెడ్డి