telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఫేక్ పాస్ పోర్ట్ స్కాం పై సీపీ సజ్జనార్..

cp sajjanar on disa accused encounter

గత నెల బంగ్లాదేశ్ కి చెందిన ముగ్గురు ప్రయాణికులు నకిలీ పాస్ పోర్ట్ లు గుర్తించారు. అయితే వీరిని విచారణ చేస్తే , నకిలీ పత్రాలు ద్వారా పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామని 72 పాస్ పోర్ట్ లు ఇలా నకిలీ పత్రాలు ద్వారా పాస్ పోర్ట్ లు పొందారని సీపీ సజ్జనార్ అన్నారు. మన రాష్ట్రంలో బోధన్ నుండి దుబాయ్ కి వెళ్లే ప్రయత్నం చేసి దొరికి పోయారని అన్నారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశాము, ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాన నిందితుడు నీతై దాస్ అలియాస్ సంజీబ్ దుట్ట అందరికి పాస్ పోర్టులు ఇప్పించారని ఈ పాస్ పోర్ట్ స్కామ్ లో ఎస్సై  మల్లేష్ రావు, ఏఎస్సై  అనిల్ కుమార్ ను అరెస్ట్ చేశామని ఆయన అన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు పరారీ లో ఉన్నారు.. వారి కోసం గాలిస్తున్నామని సజ్జనార్ అన్నారు. బోధన్ లో 7 అడ్రెస్ పేరుతో మొత్తం 72 పాస్ పోర్ట్ లు పొందారని, ఒకే అడ్రెస్ పై 37 పాస్ పోర్ట్ లు తీసుకున్నారని అన్నారు. ఈ కేసులో ఇద్దరు పోలీసులు కూడా ఎలాంటి వేరిఫికేషన్ చేయకుండా క్లియరెన్స్ ఇచ్చారని, ప్రధాన నిందితుడు  ఒక్కో పాస్ పోర్ట్ కోసం 10 నుండి 30 వేల వరకు డబ్బులు తీసుకున్నారని ఆయన అన్నారు. వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఆధార్ కార్డ్ లు ను చేంజ్ ఆఫ్ అడ్రెస్ పెట్టి బోధన్ అడ్రెస్ పేరుతో ఆధార్ కార్డ్ లు సృష్టించారని ఆయన అన్నారు. వెస్ట్ బెంగాల్ నుండి 60 ఆధార్ కార్డ్ లు తీసుకున్నట్లు విచారణ లో తేలిందని అన్నారు.

Related posts