బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్న చెత్త పార్టీ అని.. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి, జిల్లా సమగ్రాభివృద్ధికి వరాలు ప్రకటిస్తున్నారని, అందుకు సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు. సెంట్రల్ జైలు, కేఎంసీ, ప్రాంతీయ కంటి దవాఖాన ఉన్న 200 ఎకరాల స్థలంలో హెల్త్హబ్ను తీర్చిదిద్దుతారని అన్నారు. పేదల కోసం పెద్ద దవాఖానను 2వేల బెడ్లు, 33 అంతస్తుల దవాఖానను నిర్మించనున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి దేవాదుల ద్వారా నీళ్లు అందించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా నామకరణం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇప్పుడున్నది హన్మకొండ జిల్లా కలెక్టరేట్గా, వరంగల్ ఆటోనగర్లో లేదా ఆజంజాహి మిల్లు వద్దగానీ అన్ని హంగులతో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రపంచమే గర్వించేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.
previous post