ఏపీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ గుండె ధైర్యం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. తాను చేయాలనుకున్నది చేసే నేత అని జగన్ ను అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ విషయంలో జగన్ నిర్ణయానికి హ్యాట్సాఫ్ అంటూ తన అభిప్రాయం వెల్లడించారు. గతంలో కంటే మరెంతో మందికి ఉపయోగపడేలా ఆరోగ్యశ్రీని తీసుకువచ్చారని ప్రశంసించారు.
జగన్ ఎదురైతే తప్పకుండా అభినందిస్తానని, ఈ విషయంలో చంద్రబాబు ఏమన్నా పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు.చంద్రబాబు హయాంలో కమ్మవాళ్లు గోదావరి, కృష్ణాలో కలిసిపోయారని, కానీ జగన్ ఎంతో నామినేటెడ్ పోస్టులను రెడ్లకు ఇచ్చాడని, అందుకు తాను మెచ్చుకుంటున్నానని జేసీ తెలిపారు. చంద్రబాబుకు ఈ తరహా తెగువ లేదని అభిప్రాయపడ్డారు.