తెలంగాణలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి ప్రతిసారి మెట్రో టైమింగ్స్ లో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా లాక్ డౌన్ ను మరో 10 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ నుండు మినహాయింపు ఇచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 వరకే ఉంటుందని ప్రకటించారు. ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్కు చేరుకుంటుంది. కాగా, ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కరోనా మార్గదర్శకాలను పాటించాలని తెలుపుతుంది.
previous post
next post