కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్లో ఉన్నాయన్న సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతమైనది అన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తిచేయాలని కేంద్రంనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుగా డబ్బులు ఇస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా ప్రజలకు అందించాలనే తపనతో ఉన్నామని..రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదని పేర్కొన్నారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టిపెట్టాలని..చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలలకాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారని.. డిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు చేశారు.
previous post
next post
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు: జగ్గారెడ్డి