చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. .
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రైవేటు సెక్టార్లోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.