telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫోన్లో వేధింపులు.. మరోసారి పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ

సింగర్ బిగ్ బాస్ బుల్లితెర నటి మధుప్రియ మళ్లీ పోలీసులను ఆశ్రయించింది మధుప్రియ.. తన ఫోన్‌కు బ్లాంక్ కాల్స్ వస్తున్నాయంటూ షి టీమ్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది..లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ షీ టీమ్స్‌కు మధుప్రియ మెయిల్‌లో ఫిర్యాదు చేసింది.వెంటనే స్పందించిన షీ టీమ్స్ ఆ మెయిల్‌ను హైదరాబాద్ సైబర్‌‌ క్రైమ్స్‌ విభాగానికి బదిలీ చేశారు.గుర్తు తెలియని నెంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని, ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నారని మధుప్రియ ఫిర్యాదుదలో పేర్కొంది.తనకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను సైబర్ క్రైమ్‌కు అందజేసింది.మధు ప్రియ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీసీ 509, 354b సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిన్న ఇదే విషయంపై మధుప్రియ పోలీసులను ఆశ్రయించిన సంగతి అందరికి తెలిసిందే. 

Related posts