విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం రేఖా & మురళి ఆర్ట్స్ వారి ” దేవత ” 24-07-1965 విడుదలయ్యింది.
హాస్యనటుడు పద్మనాభం గారి సమర్పణలో బి. పురుషోత్తమ్ గారు నిర్మాతగా రేఖా & మురళి ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు కె.హేమాంబరధరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: కె.హేమాంబరధరరావు, కథ, మాటలు: వీటూరి, సంగీతం: ఎస్.పి.కోదండపాణి, పాటలు: వీటూరి, సి.నారాయణరెడ్డి, దాశరథి , శ్రీ శ్రీ, పాలగుమ్మి, కొసరాజు, ఫోటోగ్రఫీ: ఎం.జి.సింగ్, నృత్యం:పసుమర్తి కృష్ణమూర్తి, చిన్నిసంపత్, కళ: బి.ఎన్.కృష్ణ, ఎడిటింగ్: ఎం.ఎస్.ఎన్. మూర్తి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, సావిత్రి, నాగయ్య, పద్మనాభం, రాజనాల, గీతాంజలి, నిర్మలమ్మ, వల్లం నరసింహారావు, మాస్టర్ మురళి, రాజనాల, వంగర, పెరుమాళ్ళు,వల్లూరి బాలకృష్ణ,పేకేటి శివరాం, మహంకాళి వెంకయ్య, రాధాకుమారి, జగ్గారావు తదితరులు నటించారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు కోదండపాణి గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి. “ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి”
“కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ”
“బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా”
“తొలి వలపే, పదే పదే పిలిచే, ఎదలో సందడి చేసే,”
“మావూరు మదరాసు, నాపేరు రాందాసు”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
మహానటి సావిత్రి ఈ చిత్రం లో డ్యూయల్ రోల్
(ద్విపాత్రాభినయం) చేశారు.
చక్కని కుటుంబ కథనం తో సాగిన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో అఖండ విజయాన్ని స్వంతం చేసుకుని
విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు,
6 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది..
100 రోజుల ఆడిన కేంద్రాలు :–
1. విజయవాడ — శ్రీరామా టాకీస్ (105 రోజులు),
2. రాజమండ్రి — కృష్ణ,
3. కాకినాడ — విజయా,
4. విశాఖపట్నం — మినర్వా,
5. నెల్లూరు — శ్రీనివాస,
6. గుంటూరు — శ్రీనివాస్ మహల్
ఈ చిత్రం అర్ధ శతదినోత్సవ (50 రోజులు) వేడుకలు
రాజమండ్రి – కృష్ణ థియేటర్ లో నిర్వహించారు…
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని