ఐపీఎల్ 2021 లో రెండు మ్యాచ్లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ..రెండింటిలో ఓడి పాయింట్స్ టేబుల్లో అట్టుడగు స్థానంలో నిలిచింది. కోల్కతా నైట్రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఈ రెండు మ్యాచ్ల్లో హైదరాబాద్ విజయం ముంగిట బోర్లా పడింది. దాంతో ముఖ్యంగా కేన్ విలియమ్సన్ అవసరమేంటో తెలిసొచ్చింది. ఈ క్రమంలోనే అతని కోసం సన్రైజర్స్ ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ కేన్ మామ గాయం నుంచి పూర్తిగా కోలుకోని మ్యాచ్ బరిలో దిగడానికి మరో వారం సమయం పట్టనుంది. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో కేన్ విలియమ్సనే చెప్పాడు. ‘గాయం నయమవుతోంది. వారం రోజుల్లో పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగుతా అని విలియమ్సన్ తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ సక్సెస్లో కేనది కీలక పాత్ర. యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్లో సన్రైజర్స్ సెమీఫైనల్స్ చేరిందంటే అతని కేన్ కారణంగానే అనే విషయం తెలిసిందే.