telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాట తప్పని ప్రభుత్వం మాది: బొత్స

మాది మాట తప్పని ప్రభుత్వం అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ప్రభుత్వాల్లాగా కాదని ఇచ్కిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. చెప్పింది చేస్తామని, మాట తప్పని, మడమ తిప్పని నేత వైఎస్ జగన్ అని ఏపీ పేర్కొన్నారు. నేడు ఆయన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి విశాఖలోని లబ్దిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, విశాఖ వాసులకు మరిన్ని సౌకర్యాలు అందజేస్తామన్నారు.

విశాఖ సెంట్రల్ పార్క్‌ను వైఎస్సార్ సెంట్రల్ పార్క్‌గా మార్చినట్టు తెలిపారు. అక్కడే వైఎస్సార్ విగ్రహాన్ని సెప్టెంబర్ 2న ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని బొత్స తెలిపారు. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు.

Related posts