కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్పకు మరోసారి కరోనా సోకింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్గా తేలింది.. ఈ విషయాన్ని కర్ణాటక సీఎంవో ప్రకటించింది.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు యడ్యూరప్ప.. ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో.. ఇప్పుడు అక్కడి నుంచి మణిపాల్ ఆస్పత్రికి తరలించనున్నారు. ఇక, ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మంత్రి కె సుధాకర్, బిబిఎంపి కమిషనర్ గౌరవ్ గుప్తా కూడా పాల్గొన్నారు… ఇక, యడ్యూరప్ప.. కోవిడ్ టీకా తొలి డోస్ను కూడా మార్చి 12వ తేదీన తీసుకున్నారు.. అయినా ఆయన రెండోసారి కోవిడ్ బారినపడ్డారు.. కాగా, 2020 ఆగస్టులో తొలిసారి ఆయనకు కోవిడ్ సోకింది.. దీంతో.. ఆగస్టు 2 న మణిపాల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. నెగిటివ్గా వచ్చిన తర్వాత ఆగస్టు 10న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
previous post
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి