రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే రాశీ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా… రీసెంట్గా రాశీఖన్నా షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారందరూ రాశీఖన్నా లుక్తో పాటు ఆమె అందాల విందుకు ఫిదా అవుతున్నారు.
previous post
next post